30 June, 2026 | 11:24 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మంత్రి పొంగులేటి, ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న

26-11-2025 04:45 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన తోట దేవి ప్రసన్న బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్దిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఆర్ఆర్ఆర్ ఆమెను అభినందించారు. భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తు కార్యక్రమాలపై ముఖ్యమైన సలహాలు, సూచనలు చేశారు. పార్టీ బలోపేతం, కేడర్‌కు ఉత్సాహం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సాగాల్సిన పార్టీ చైతన్య కార్యక్రమాలపై పలు సలహాలు ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ఉన్నారు.