27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఏడాదికి ఒక్కరోజే దత్త దర్శనం

17-01-2026 02:09 AM
  1. పాలమాకుల ‘మునుల బండ’పై రేపే జాతర
  2. సిద్దిపేట జిల్లాలో అరుదైన దత్త క్షేత్రం
  3. మునులు తపస్సు చేసిన పవిత్ర పుణ్యస్థలి

నంగునూరు, జనవరి 16:ప్రకృతి ఒడి లో, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య వెలసిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల శ్రీ దత్తాత్రేయ స్వామి వార్షిక జాతర ఈ ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది.ఏడాది పొడవునా మూ సి ఉంచే ఈ ఆలయ తలుపులు కేవలం మా ఘ అమావాస్య పర్వదినం రోజు తెరుచుకుంటాయి.

మునుల తపస్సు.. మొండి వ్యాధుల నివారణ

వేల సంవత్సరాల క్రితం మునులు ఈ శిలపై తపస్సు చేయడం వల్ల దీనికి ‘మునుల బండ’ పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతారు.బండపై హరినామం ఆకారంలో బ్ర హ్మ, విష్ణు, మహేశ్వర గుండాలు కొలువై ఉ న్నాయి. ఈ గుండంలోని పవిత్ర జలంతో స్నానం ఆచరిస్తే మొండి వ్యాధులు ప్రాప్తి క లుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన చీకోటి వంశస్థులు ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతు న్నాయి. ఈ గుట్టపై నుండి శనిగరం చెరువు అందాలు, చుట్టుపక్కల పచ్చని పొలాలు అ ద్భుతంగా కనిపిస్తాయి.దత్తన్న దర్శనానికి వచ్చే వారు సమీపంలోని అష్టలక్ష్మి ఆలయా న్ని కూడా సందర్శించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

జాతరకు భారీ ఏర్పాట్లు

మండల పరిధిలోని పాలమాకుల,రాజగోపాల్పేట, వెంకటాపూర్,ముండ్రాయి గ్రా మాల సరిహద్దులో వెలసిన ఈ క్షేత్రానికి వే ల సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం చీకోటి వంశస్థులు, గ్రామస్తులు కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తా గునీరు, క్యూలైన్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.