10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

డీఏలను విడుదల చేయాలి

17-02-2026 07:45 PM

- STU TS జిల్లా అధ్యక్షుడు 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న DA లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU TS) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బట్టారి వెంకటేశ్వర్లు కోరారు. మంగళ వారం stu ts కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రధాన కార్యదర్శి ఓడిగె కృష్ణతో కలిసి మాట్లాడుతూ... PRC ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPS విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని,

ఉద్యోగుల ఆరోగ్య పథకంకి సంబంధించి ఉద్యోగుల యొక్క చందాను జీతంలోని బేసిక్ పై శాతంలో కాకుండా అందరికీ ఒకేవిధంగా నిర్దిష్ట మొత్తాన్ని తీసుకునేలా ఉండాలన్నారు.  మెడికల్ బిల్లులు, సరెండర్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చీపెల్లి బాపు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అర్షేనపల్లి సత్తయ్య, జిల్లా కార్యదర్శి B.మన్మోహన్ , ఆర్థిక కార్యదర్శి M.సుమన్ , మంచిర్యాల మండల ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.