విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
18-06-2026 02:15 AM
1.62 శాతం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): తెలంగా ణలోని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కరవు భత్యాన్ని (డీఏ) పెంచింది. 1.62 శాతం మేర పెంచుతూ బుధవారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 70,804 మంది ఉద్యోగులకు మేలు కలగనుంది. కాగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉన్నా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.






