10 April, 2026 | 8:34 PM

Breaking News

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •  

అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...

10-04-2026 06:46 PM

- జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్ర

మునుగోడు,(విజయక్రాంతి): అందరికీ విద్య, వైద్యం, నివాస సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తేనే సమానత్వం వస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం అన్నారు. మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగిస్తూ ఇంటింటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు సిపిఐ సేవలు, పార్టీ అవసరాన్ని వివరించి మాట్లాడారు. సహజ వనరులను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడం ద్వారా మాత్రమే సమసమాజం సాధ్యమవుతుందని అన్నారు.  మతం, కులం, ప్రాంతం పేరుతో స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు గుర్తించాలని, సమసమాజం కోసం పోరాడే సిపిఐ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు.