2 May, 2026 | 9:35 PM

ఇల్లందు ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం (ఎస్టేట్)

02-05-2026 08:08 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (ఎస్టేట్) లక్ష్మిపథి గౌడ్ శనివారం ఇల్లందు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు, జరుగుతున్న పనులను సమీక్షించారు. పనుల పురోగతిపై ఏరియా జీఎం వి. కృష్ణయ్యని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.