13-02-2026 12:35:27 AM
పదేళ్లలో రాని నిధులు ఇప్పుడు మంజూరు చేశాం
రూ. 530 కోట్లతో తాగునీటి సరఫరా పనులకు శ్రీకారం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవ ర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, ఐదేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రా జేందర్ రెడ్డి అన్నారు. గురువారం నగర మే యర్ గుండు సుధారాణితో ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల ను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మె ల్యే అన్నారు.
ఇందులో భాగంగా 5వ డివిజన్ పరిధిలో రూ. 90 లక్షల వ్యయంతో మార్కాజీ స్కూల్ నుండి మంగలి వాగు బ్రి డ్జి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే 30వ డివిజన్ చిల్డ్ర న్ పార్కులో రూ. 70 లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు భూమి పూజ చేశారు. నీటి కష్టాలకు శాశ్వత పరిష్కా రం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అ యిన తాగునీటి సమస్యపై నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గానికి రాని నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాధించాం.
ము ఖ్యంగా వాటర్ సప్లై మెరుగుపరచడం కోసం రూ. 530 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించాం. త్వరలోనే పశ్చిమ పరిధిలో నీ టి ఇబ్బందులు లేకుండా చేస్తాం అని అ న్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ నగరాభివృద్ధిలో ఎమ్మె ల్యే నాయిని చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. మున్సిపల్ కార్పొరే షన్ సహకారంతో వార్డుల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. క్వాలిటీతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, రావుల కోమల, డివిజన్ అధ్యక్షులు స్రవంతి, రమేష్, నాయకులు బొంత సారంగం, మాజీ కార్పొరేటర్ మాధ వి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక కాలని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.