17-02-2026 06:53:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నిర్మల్ భైంసా రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత నేషనల్ హైవే అధికారులు పట్టించుకోకపోవడంపై మంగళవారం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్కు వివరాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వినోద్ రాజేశ్వర్ తదితరులున్నారు.