26 June, 2026 | 6:31 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు

13-04-2026 04:25 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని పచ్చటి పంట పొలాల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా వెంచర్ వేస్తున్నారని సోమవారం ప్రజావాణిలో రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన తూమింట చెన్నయ్యతో పాటు పలువురు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

పాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 19AA/1, 19AA /2/2, 20AA2/1/1, 20E1/1/1, 20E1/2/1 ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు రైతుల అనుమతి లేకుండా, డీటీసీపీ అనుమతులు లేకుండానే పంట పొలాల్లో రోడ్లు వేసి వెంచర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సుమారు 33 గుంటల మేర రహదారి కూడా వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తమ పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని ఈ అక్రమ వెంచర్‌పై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.