24 March, 2026 | 6:37 PM

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు

24-03-2026 04:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికి తీసేందుకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా పోస్టల్ శాఖ అధికారి గుంపు స్వామి అన్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలో విద్యార్థులకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. సుమారు 52 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు పరీక్షల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ తపాలా పర్యవేక్షకుడు బోరెడ్డి గుంప స్వామి,IP(C&PG) జాదవ్ కిరణ్,ఆదిలాబాద్ ఐపీ రాజు, ఆదిలాబాద్ హెచ్ఓ పీఆర్ఐపీ మహేష్ రెడ్డి, ఆఫీస్ అసిస్టెంట్ రాధికా, సిబ్బంది పాల్గొన్నారు.