19 May, 2026 | 7:49 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

దృష్టిలోపం.. కళ్ళజోడు అందించేందుకు అభినందనీయం

20-12-2025 09:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): దృష్టిలోపం ఉన్నవారికి భారత్ డైనమిక్ లిమిటెడ్ (భారత రక్షణ మంత్రిత్వ శాఖ), బ్లెండ్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కళ్ళజోడు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్. పి. నితిక పంత్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి హాజరై 26 మంది దృష్టిలోపం ఉన్నవారికి స్మార్ట్ విజన్ కళ్ళజోళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బ్లెండ్ విజన్ ఫౌండేషన్ వారు సామాజిక బాధ్యతలో భాగంగా దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోడు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కళ్ళజోడు ధర రూ.40 వేలు ఉంటుందని, ఇవి ఎ. ఐ. సాంకేతికత ఆధారంగా బెంగళూరుకు చెందిన జాతీయ సంస్థ ఎస్. హెచ్. జి. టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డాయని తెలిపారు. ఈ కళ్ళజోళ్లను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చి చూపులేని అభాగ్యులను ఆదుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.