పాఠం చెప్పి.. భోజనం చేసిన కలెక్టర్
19-06-2026 03:54 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం దిల్వార్పూర్ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ పరిసరాలను పరిశీలించారు. వంట గదిలోకి వెళ్లి కూరగాయలను చూశారు. తరగతి గదిలోకి వెళ్లి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం బోధించి ప్రశ్నలకు జవాబులు రాబట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని సామూహిక భోజనం నిర్వహించారు. కస్తూరిబా పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పిల్లల మౌలిక వసతులపై ఎస్ఓ అపర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధికారులు పాల్గొన్నారు






