30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మణుగూరు ఏరియాలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి

31-10-2025 10:29 PM

జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ వెల్లడి

మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో అక్టోబర్ నెలలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ తెలిపారు. శుక్రవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఉత్పత్తి, ఉత్పాదకత వివ రాలను వెల్లడించారు. అక్టోబర్ నెలలో 10 లక్షల 36 వేల 500 టన్నులకు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం గాను 7 లక్షల 52 వేల 484 టన్నుల అంటే  73 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే  ఏప్రిల్, అక్టోబర్  వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 62 లక్షల 11 వేల టన్నుల లక్ష్యానికి గాను 59 లక్షల 31 వేల 117 టన్నులతో 95 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. ఏరియా నుండి 6 లక్షల 74 వేల 84 ట న్నుల బొగ్గును రవాణా చేసామని,  ప్రోగ్రె స్సివ్ గా 58 లక్షల 39 వేల 525 టన్నులు రవాణా జరిగిందన్నారు.అధిక వర్షాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పేర్కొన్నారు.