30 June, 2026 | 9:36 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కృషి

01-11-2025 12:00 AM

జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి దివాకర్ గౌడ్

కుమ్రం భీం అసిఫాబాద్, అక్టోబర్ 31(విజయ క్రాంతి): కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిందని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి దివాకర్ గౌడ్ అన్నారు. ఏఐటీ యూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, సివిల్ సప్లై గోదాం, పొట్టి శ్రీరాములు చౌక్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

దివాకర్ గౌడ్ మాట్లాడుతూ 1920లో లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఏఐటీయూసీ, స్వాతంత్య్ర సమరంలోనూ, కార్మిక హక్కుల సాధనలోనూ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సుధాకర్, భూమన్న, వెంకన్న, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.