మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై(Moinabad drug case) సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని తెలిపారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో తమ ప్రమేయం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వేశామని చెప్పారు. 2029లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.




