15 June, 2026 | 7:59 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళులు

03-10-2025 03:22 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy) భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులు అర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వారి పార్దివ దేహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కూడా నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దామోదర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో ఒకసారి మంత్రి పదవిని చేపట్టారు. ఆయన అసెంబ్లీలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.