9 April, 2026 | 7:41 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు

09-04-2026 06:13 PM

పిడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు..

బాన్సువాడ,ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ పలు రైస్ డిపోలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సివిల్ సప్లై డిప్యూటీ అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు. పిడిఎస్ బియ్యాన్ని రైస్ డిపో యజమానులు ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ అశోక్ సిబ్బంది ఉన్నారు.