18 June, 2026 | 4:48 PM

Breaking News

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •  

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు

18-06-2026 03:45 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి (విజయక్రాంతి): రైతులను నమ్మించి నకిలీ విత్తనాలమ్మితే కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎం ఎన్ ఏ పి ద్వారా రైతులకు కందులు పెసరి జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండిస్తేనే, మనందరి కడుపు నిండితయని, వారిని మోసం చేసే మాత్రం క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలు లేకుండా సంబంధిత ఏవో ఏఈలు చొరవ చూసుకోవాలని, లేనియెడల చర్యలు తీసుకుంటామని అన్నారు.

నియోజకవర్గ పరిధిలోని నూతనకల్లో ఓ వ్యక్తి 20 బ్యాగులు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిసి తక్షణమే  ఫోన్లో పోలీస్ శాఖను చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ కోరారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున, పంట మార్పిడి విధానం ద్వారా పంటలు పండించుకోవాలని కోరారు. గత సంవత్సరం ఆయా మండలాల్లో ఎన్ని టన్నుల యూరియా కొనుగోలు చేశారో అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గ్రామాల్లో చిరుధాన్యాల పంటల పై అధికారుల అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం వెంపటి గ్రామానికి చెందిన ఉద్యమకాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాష బోయిన వెంకన్న పుట్టినరోజును ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించగా శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పాలెపు చంద్రశేఖరు, నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు యాదవ్ , మాచర్ల అనిల్, పెద్ద బోయిన అజయ్, దాసరి శ్రీను, మహేందర్ గౌడ్, వివిధ మండలాల ఏఈవోలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.