ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి
విద్యార్థి సంఘాల డిమాండ్, వినతి...
బాన్సువాడ, జూన్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అక్రమ వసూలు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం బాన్సువాడ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం జరుగుతుందని వారు ఆరోపించారు. ప్రవేట్ పాఠశాలలో మధ్యవర్తి వద్ద నోటు పుస్తకాలు యూనిఫామ్ ఇతరత్రా వస్తువులు పాఠశాల యాజమాన్యాలు విక్రయిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుస్తకాలు యూనిఫాంలో అమ్మకుండా నిషేధించాలని ప్రభుత్వా నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవీందర్ గౌడ్ దత్తు నిఖిల్ తదితరులు ఉన్నారు.






