పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్
02-04-2026 01:09 AM
చేగుంట ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం చేగుంట చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణం లో ఉన్న చికెన్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేసి గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీలు,రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దుకాణాల అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు సతీష్, వార్డు సభ్యులు ఆరిఫ్ మొహమ్మద్ శకీల్, మహమ్మద్ సలీం, మహమ్మద్ కలీం, హామీద్, కటిక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




