1 July, 2026 | 7:57 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

పోలీసుల అదుపులో చికెన్ సెంటర్ యజమాని?

15-04-2026 12:26 AM
  1. ఆర్టీసీ టికెట్ల రోల్స్‌పై కొనుగోలుదారులకు బిల్లులు
  2. హుస్నాబాద్ డిపో అధికారులకు ఫిర్యాదు

హుస్నాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ టికెట్ రోల్‌ను వినియోగించి చికెన్ సెంటర్‌లో బిల్లులు ఇవ్వడం సంచలనంగా మారింది. గాంధీ విగ్రహం సమీ పంలో ఉన్న ఓ చికెన్ సెంటర్‌లో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇచ్చే టికెట్లకు సంబంధించిన రోల్స్‌పై చికెన్ కొనుగోలుదారులకు బిల్లులు ముద్రించి ఇవ్వ డం బయటపడింది.

ఈ విషయంపై హు స్నాబాద్ ఆర్టీసీ డిపో అధికారులు ఫిర్యా దు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. సంబంధిత చికెన్ సెంట ర్ యజమాని అశ్రఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు స మాచారం.ఈ టికెట్ రోల్స్ అతని వద్దకు ఎలా చేరాయి? దీనికి మరెవరైనా సం బంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రభు త్వ సంస్థకు చెందిన వస్తువులను అక్రమంగా వినియోగించడంపై కఠిన చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ టికెట్ వ్యవ స్థలో ఉన్న లోపాలు కూడా బయటపడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.