చేవెళ్ల నూతన ఆర్డీవోకు సత్కారం
06-03-2026 02:36 AM
చేవెళ్ళ మార్చి 5(విజయక్రాంతి): నూతనంగా చెవెళ్ల ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన పార్థసింహ రెడ్డిని చేవెళ్ల మునిసిపల్ 10వ వార్డ్ కౌన్సిలర్ పెద్దొళ్ళ దయాకర్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక విషయాలు కాసేపు ముచ్చట్టించిన క్రమంలో ఇక్కడి ప్రజలు అధికారులు నెరవేర్చే ఉద్యోగ బాధ్యతలకు సహకరిస్తారని చెప్పారు.
తను చేవెళ్ల ఆర్డిఓ ఆఫీసులో ఉద్యోగి పనిచేశానని ప్రజా సేవే లక్ష్యంగా జాబ్ వదిలి ప్రజా సేవకు అంకితం అయ్యానని చెప్పుకొచ్చారు. డాక్టర్ వైభవ్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత రెడ్డి, బీజేపీ చెవెళ్ల మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




