25 ఏళ్లలో BRS అరుదైన ఘనత: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ(BRS Party Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్(Telangana Rashtra Sena) పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కేటీఆర్ నిరాకరించారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 25 ఏళ్లలో బీఆర్ఎస్ అరుదైన ఘనత సాధించిందని పేర్కొన్నారు.
బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న నినాదంతో ముందుకెళ్లామని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సూచించారు. తెలంగాణలో పదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించామని తెలిపారు. రెండున్నరేళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నామని వివరించారు. తిరిగి కేసీఆర్ ను సీఎం చేయడమే బీఆర్ఎస్ సైనికుల లక్ష్యమని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలిపారని కేటీఆర్ వెల్లడించారు. 25 ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






