పాము కాటుతో బాలుడు మృతి
30-05-2026 08:12 PM
బిజినేపల్లి: మండలంలోని సల్కర్ పేట గ్రామానికి చెందిన మేకల చరణ్ (11) అనే బాలుడు శుక్రవారం రాత్రి పాము కాటుకు గురై శనివారం ఉదయం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేకల చరణ్ అనే బాలుడు శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆరు బయట నిద్రిస్తున్నాడు. మధ్యరాత్రి కట్ల పాము బాలుడిని కాటేసి అక్కడే ఉండి పోయింది. విషయం గమనించిన తల్లి తండ్రులు ఉదయం నాగరుకర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. బాలుడి పరిస్థితి అప్పటికే విషమించడంతో మరణించాడు. తల్లితండ్రులు అంజనమ్మ బంగారయ్యలకు చరణ్ ఏకైక కుమారుడు. చరణ్ కు ఇద్దరు అక్కలు ఉన్నారు.






