బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు
04-07-2026 08:38 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున బవ్వచి హోటల్ రూ. 1వేయి జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, దత్తు రావు, పాలుగోన్నారు






