6 April, 2026 | 5:26 PM

శాత్రాజ్ పల్లిలో నూతన సబ్ స్టేషన్ కు భూమిపూజ

06-04-2026 03:13 PM

ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని  పారుపల్లి గ్రామ పంచాయతీ లోనీ శాత్రాజుపల్లి లో నూతన సబ్ స్టేషన్ కి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు,  ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్  బుచ్చం రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మాజీ పాక్స్ చైర్మన్ యాదగిరి రావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బియ్యని శివకుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, గ్రామ  సర్పంచ్ చొప్పరి సంపత్, ఉప సర్పంచ్ బోడ బాపు, సీనియర్ నాయకులు తూటి రఫీ, తాటిపాముల శంకర్, డా. చారి, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.