11 July, 2026 | 7:13 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

11-07-2026 05:51 PM

కేకు కోస్తున్న మండల బిజెపి నాయకులు

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ (55)వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి కరీంనగర్ కార్పొరేటర్ గా, రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా పదవులు అలంకరించి బిజెపి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసిన గొప్ప బహుజన నాయకుడన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే దమ్మున్న నాయకుడు,హిందూ ధర్మ పరిరక్షకుడు మన బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని   దీమా వ్యక్తం చేశారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో కలకాలం జీవించాలని సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కోసి అందరికీ పంచిపెట్టారు.