బాల్క సుమన్కు బెయిల్
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మంచిర్యాల కోర్టు
ఆదిలాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువ గల ఎగ్జిక్యూటివ్ బాండ్ సమర్పించడంతో పాటు, ఒక్కొక్కరికి ఇద్దరు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏ1, ఏ2, ఏ4, ఏ8 లు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. ఈ నిబంధనలు మూడు నెలల ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
సుమన్ బెయిల్ రద్దు చేయండి
ఇదిలా ఉండగా చెన్నూరు పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై నమోదైన ఉన్న కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది.




