17 April, 2026 | 8:15 PM

ప్రమాదాల నివారణకు అవగాహన

17-04-2026 06:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బస్సులు నడిపే డ్రైవర్లు సురక్షిత ప్రయాణం ఇష్టపడతారని ఎదుటివారిని కూడా గుర్తించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏకగ్రతతో బస్సు నడిపితే ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన, డిఎం పండరి, ఆర్ అండ్ బి ఈ సుభాష్, అధికారులు ఉన్నారు