7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన సహాయ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

23-04-2026 01:49 AM

పాలకవీడు, ఏప్రిల్ 22: మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు సహాయ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి యామిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి పని వివరాలు అడిగి తెలుసుకన్నారు.

గరిష్ట వేతనం 307 రూపాయలు వచ్చే విధంగా కూలీలకు అవగాహన కల్పించాలని సిబ్బందినీ ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత అధికమవుతున్న సందర్భంగా రెండు సార్లు ఫోటో హాజరు తప్పని సరి అయినందున ఉదయమునే ఏడు గంటలలోపు పని ప్రదేశంలోకి వచ్చి 11 గంటల వరకు పని పూర్తి చేసుకోవాలని కూలీలకు సూచించారు.

అలాగే కూలిలకు పని ప్రదేశంలో కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయమని పంచాయతీ కార్యదర్శి వినయ్ ని ఆదేశించారు. తదుపరి గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించి తగు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.లక్ష్మి, అదనపు కార్యక్రమ అధికారి రాజు, పంచాయతీ కార్యదర్శులు వినయ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.