ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో కళాకారిణి ప్రతిభ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తిరువనంతపురంలో అద్భుతంగా నిర్వహించిన 5వ అనంతపురి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో మహబూబ్నగర్ కళాకారిణి ప్రతిభ చాటారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లోని భారత్ భవన్ లో నిర్వహించిన 5వ అనంతపురి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో మహబూబ్నగర్కు చెందిన ప్రముఖ నృత్య గురువు, Master in Performing Arts (Kuchipudi) మరియు B. Ed. కళాశాల అతిథి అధ్యాపాకురాలు జి. శాంతి మాస్టర్ పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.
ఈ అంతర్జాతీయ వేదికపై వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొనగా, శాంతి మాస్టర్ కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ నృత్య శైలిని ఆధునిక అభినయంతో మేళవించి అందించిన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కళాకారిణి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచడం గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు. శాంతి మాస్టర్ ఈ విజయంతో జిల్లా కళాకారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.






