29 May, 2026 | 10:33 PM

ఇసుక బస్తాలే శాశ్వత పరిష్కారమా...?

29-05-2026 02:19 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి సమీపంలో వాగుపై నిర్మించిన కాలవ వంతెన (అక్విడక్ట్) వద్ద గతేడాది జూన్, జులైలో కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోయి కుంగిపోయింది. దీంతో కాలవ నీరు భూములకు వెళ్లకుండా నేరుగా వాగులోకి వెళ్లి వృథాగా పోయింది. అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా మట్టి పోసి ఇసుక బస్తాలు అడ్డుగా పెట్టి చేతులు దులుపుకొన్నారు. ఇది ఇలాగే ఉంటే వర్షాకాలంలో మరోసారి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నారు.