ఫార్మసీ కౌన్సిల్ సభ్యునిగా చిలువేరి మారుతి నియామకం
22-08-2026 06:14 PM
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడుగా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మారుతిని నామినేట్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురికి అవకాశం కల్పించగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మారుతికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాసవి అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.






