23 June, 2026 | 8:54 PM

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

23-06-2026 07:35 PM

కల్లూరు,(విజయక్రాంతి): యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరంగా అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అలాగే సమాజంలో నేరాల పెరుగుదలకు కూడా ఇవి కారణమవుతాయని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.