23 June, 2026 | 10:05 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఫోటోగ్రాఫర్‌ కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

23-06-2026 08:53 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ భజన మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బూర్గంపాడు మండల ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ల సహకారంతో మంగళవారం మ‌ల్ల‌య్య కుటుంబ సభ్యులకు రూ.1.60 లక్షల కుటుంబ భరోసా ఆర్ధిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు ఒక సంఘంగా ఏర్పడి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.హుస్సేన్ సారధ్యంలో ఈ పథకాన్ని ఆవిష్కరించుకున్నారని, 20 వేల సభ్యులతో కొనసాగుతున్న ఈ సంఘంలో ప్రతి ఫొటోగ్రాఫర్ రూ.10 చొప్పున సంఘం ఖాతాలో జమ చేయాలని.. అప్పుడు రూ.1.70 లక్షలు సంఘం ఖాతాలో జమ అవుతాయని వీటిని ఎవరైనా సభ్యుడు మరణిస్తే రూ.1.60 లక్షలు చొప్పున బాధిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని, రూ.10 వేలు వైద్యఖర్చులకు అందిస్తామని తెలిపారు. ఈ నగదుతో ఓ ఫొటోగ్రాఫర్ కుటుంబానికి కుటుంబ భరోసా కల్పించినట్లవుతుందని తెలిపారు.