23 June, 2026 | 10:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

చర్ల రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా

23-06-2026 08:39 PM

నాణ్యమైన విత్తనాలు, ఎరువులపై రైతులకు అవగాహన

చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రైతు వేదికలలో విత్తన మేళా" కార్యక్రమంలో భాగంగా చర్ల మండల రైతు వేదికలో విత్తన మేళాను ఘనంగా నిర్వహించారు. ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న ఈ మేళాలో రైతులకు ఆర్ ఎన్ ఆర్ 15048, బిపిటి -5204 తదితర అధిక దిగుబడి వరి విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయ విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ  లాంటి ఆధునిక ఎరువులు అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతు వేదికల ద్వారా రైతులకు అన్ని సేవలు ఒకే చోట అందుతున్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని, మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమానికి , ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందుల రమేష్ బాబు, ప్రముఖ రైతులు  ఎడారి గణపతి, గొంది శేఖర్, సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అఫ్రీద్,  తదితరులు హాజరై రైతులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండలానికి చెందిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విత్తనాలు, ఎరువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. సత్యం పెస్టిసైడ్స్ & సీడ్స్, కొత్తగూడెం వారు మేళాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.