ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు..ముగ్గురు బీఆర్ఎస్ నేతలు నిందితులుగా SIT
ముఖ్యాంశాలు
✅ ముగ్గురు బీఆర్ఎస్ నేతలను నిందితులుగా చేర్చిన SIT
✅ 4,013 మందిపై అక్రమ నిఘా ఆరోపణలు
✅ 618 ఫోన్ సంభాషణలు ట్యాప్ చేసినట్లు ఆధారాలు
✅ మాజీ అధికారుల వాంగ్మూలాలతో కీలక పురోగతి
✅ త్వరలో కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా పరిణామం ఏమిటి?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT ముగ్గురు బీఆర్ఎస్ నేతలను నిందితులుగా చేర్చింది. 2023 ఎన్నికల సమయంలో 4,013 మందిపై అక్రమ నిఘా పెట్టినట్లు గుర్తించింది. త్వరలో అనుబంధ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో భారీ ట్విస్ట్..! ముగ్గురు బీఆర్ఎస్ నేతలను నిందితులుగా చేర్చిన SIT.. బయటపడిన షాకింగ్ వివరాలు.
హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో(Telangana phone tapping case) మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు(SIT officials) ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా చేర్చింది. ముగ్గురు నేతలపై అనుబంధ అభియోగపత్రం సిద్ధం చేసినట్లు సమాచారం. లీగల్ క్లియరెన్స్ అనంతరం కోర్టులో దాఖలు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
2023 నవంబర్ 15-30 మధ్య 4,013 మందిపై అక్రమ నిఘా పెట్టినట్లు సిట్ గుర్తించింది. సిట్ అధికారులు 618 మంది ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. మాజీ ఎస్భీఐ చీఫ్ ప్రభాకర్ రావు(Former SBI Chief Prabhakar Rao) వాంగ్మూలం దర్యాప్తులో కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. మాజీ డీజీపీ, సీఎంఓ, హోంశాఖ అధికారుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. ముగ్గురు నేతలకు ట్యాపింగ్ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధారాలు లభించకపోవడంతో మాజీ ప్రజాప్రతినిధికి ఊరట లభించినట్లు తెలుస్తోంది.






