17 May, 2026 | 7:14 PM

ఘనంగా అంకిరెడ్డి వర్ధంతి వేడుకలు

17-05-2026 06:14 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి తండ్రి గుండ్లపల్లి మాజీ సర్పంచ్ శానంపూడి అంకిరెడ్డి  వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ... గుండ్లపల్లి గ్రామ అభివృద్ధికి అంకిరెడ్డి  చేసిన సేవలు మరువలేనివని,వారి అడుగుజాడల్లోనే నా వంతుగా అధికారంలో ఉన్నా,లేకున్న గ్రామాభివృద్ధికి చేతనైనంతగా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు.