16 May, 2026 | 4:15 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

ఘనంగా అనంత పద్మనాభ స్వామి జాతర

02-03-2026 08:29 PM

అట్టహాసంగా సాగిన ఎడ్ల బండ్ల ఊరేగింపు

పాపన్నపేట: మండల పరిధిలోని ఆరేపల్లి, యూసఫ్ పేట గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం అనంత పద్మనాభ స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఎడ్లబండ్ల ఊరేగింపును కనులారా తిలకించి, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఇరు గ్రామాల సర్పంచులు రజిత రాజశేఖర్, అనిత నరేందర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.