2 March, 2026 | 9:48 PM

ఘనంగా అనంత పద్మనాభ స్వామి జాతర

02-03-2026 08:29 PM

అట్టహాసంగా సాగిన ఎడ్ల బండ్ల ఊరేగింపు

పాపన్నపేట: మండల పరిధిలోని ఆరేపల్లి, యూసఫ్ పేట గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం అనంత పద్మనాభ స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఎడ్లబండ్ల ఊరేగింపును కనులారా తిలకించి, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఇరు గ్రామాల సర్పంచులు రజిత రాజశేఖర్, అనిత నరేందర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.