15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

గరిడేపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 06:32 PM

* అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచానికే ఆదర్శం

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద పలు యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ అధికారి సరోజ, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ స్రవంతి, పోలీస్ స్టేషన్లో ఎస్సై చలికంటి నరేష్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రస్తుత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సంఘాల సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.