15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 06:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరువలేనివనివని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సైతం వారు కృషి చేసినట్లు తెలిపారు.

అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెడిసమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు సాధం అరవింద్, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, కృష్ణమోహన్, ముత్యం, ధర్మాజీ గారి ఈశ్వర్, సూరజ్ నాయక్, విఠల్, సాత్విక్, అర్జున్, జింక సూరి, ఖమ్మం సురేందర్, గంజి రాజు, పట్టణ బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, చరణ్ మౌర్య, గిల్లీ విజయ్, పుదరి రంజిత్,  నేరేల్ల సాయి, సంతోష్, లింగయ్య, తో పాటు తదితరులు పాల్గొన్నారు.