30 May, 2026 | 3:53 PM

హీరో అజిత్‌ కుమార్‌కు మాతృవియోగం

30-05-2026 03:04 PM

ముంబై: తమిళ నటుడు అజిత్ కుమార్ తల్లి, మోహిని మణి(Ajith Kumar mother Mohini Mani dies) శనివారం నాడు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్ల. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, అజిత్ దుబాయ్‌లో ఉన్నప్పుడు తన తల్లి మరణ వార్తను తెలుసుకున్నారు. వెంటనే చెన్నైకి తిరిగి ప్రయాణించినట్లు సమాచారం.

ఆమె మరణం పట్ల అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ తండ్రి పి. సుబ్రమణియం (పి.ఎస్. మణి) 85 ఏళ్ల వయసులో మార్చి 24, 2023న మరణించిన సరిగ్గా మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన తల్లి మృతిచెందారు. ఈ విషయాన్ని నటుడి సోదరుడు అనిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అజిత్ తల్లి మృతి పట్ల విజయ్, కమల్ హాసన్, ఎం.కె. స్టాలిన్, కె. అన్నామలై సంతాపం తెలిపారు. 2025లో విడుదలైన 'విదాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో చివరిసారిగా కనిపించిన అజిత్, తన తదుపరి చిత్రాలను ఇంకా ప్రకటించలేదు. 'అజిత్ కుమార్ రేసింగ్' ద్వారా, ఆయన ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కార్ రేసింగ్‌లో వృత్తిపరంగా పోటీపడుతున్నారు.