30 June, 2026 | 11:24 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నిరాశపరిచిన బడ్జెట్

21-03-2026 12:25 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడవ పూర్తిస్థాయి బడ్జెట్ కూడా నిరాశజనకంగానే ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైన ఆరు గ్యారెంటీలకి నిధులు పెంచకపోగా ఈ బడ్జెట్ లో గ్యారెంటీ లకి దరిదాపు 6 వేల కోట్ల రూపాయల మేరకు నిధులు తగ్గించటం వలన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు కనిపించటం లేదు.

వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి బడ్జెట్ లో నిధులు తగ్గించడమే కాదు విద్య ఆరోగ్య రంగాలకి సంతృప్తి కరస్థాయిలో బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లాంటి కొత్త పథకాన్ని ప్రకటించినా ఆ పథకం అమలుకి సంబంధించిన నిధుల ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ కాలేజీలకి కూడా అమలు చేస్తేబాగుండేది. పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి 2500 రూపాయల ప్రస్తావన లేకపోవటం బడ్జెట్ నిరాశ జనకంగానే ఉన్నది.      

డాక్టర్ తిరుణహరి శేషు