ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదు
కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్
కరీంనగర్,ఆగస్టు12(విజయక్రాంతి):కరీంనగర్ పట్టణంలోని బీజేపీ నాయకుల దాడి లో గాయపడిన కిసాన్ నగర్కు చెందిన గు గులోత్ శ్రీకాంత్ కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మా జీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని అన్నారు.ప్రశ్నించే వారికి సమాధా నం చెప్పాలి కానీ దాడులు చేయడం హేయమైన చర్య అనిరెండు సంవత్సరాల్లో దాడు లు పెరిగిపోయాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివా స్, కుర్ర తిరుపతి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ రాజేందర్ రావు,జక్కుల నాగరాజు, మధుసూదన్ రెడ్డి,నయీమ్, సం పత్ గౌడ్, విజేందర్ రెడ్డి, రవి నాయక్, ఇమ్రాన్, ఓంకార్ పాల్గొన్నారు






