5 June, 2026 | 5:57 AM

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం

05-06-2026 01:20 AM

బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్ జూన్ 4 (విజయ క్రాంతి): తెలంగాణలో రాబోతుంది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం నిర్మల్ జిల్లాలోని బాలాజీ ఇన్ లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  జిల్లా స్థాయి శిక్షణ తరగతులను బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాను. ‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చాను. 

తెలంగాణలో బిజెపికి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలి.  పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసి కృషి చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ గారు, రావుల రాంనాథ్ గారు, మేడిశెమ్మే రాజు గారు, యాతాళం చిన్నారెడ్డి గారు, నల్లా రవీందర్ రెడ్డి గారు, కరిపే విలాస్ గారు, సత్యం చంద్రకాంత్ గారు, బుర్ర రమేష్,జిల్లా పాదాధికారులు రాష్ట్ర నాయకులు, జిల్లా లోని మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.