10 April, 2026 | 5:30 PM

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం

10-04-2026 03:34 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో(Kalvakuntla Chandrashekar Rao) ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి(Jeevan Reddy Meet KCR) శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ కలిసినప్పుడు జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నా.. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ తో కలిసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పారు. ఇన్నాళ్లకైనా కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి,  ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.