2 July, 2026 | 5:01 PM

Districts - Yadadri Bhuvanagiri

article_70610966.webp
యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

యాదాద్రి: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష(Yadagirigutta Temple Development) నిర్వహించారు. హరేరామహరేకృష్ణ ఫౌండేషన్ కు భూమి కేటాయింపుపై చర్చించారు. హరేరామ ఫౌండేషన్ కు మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలని ఆదేశించారు. మఠాలు, కుల సంఘాల భూకేటాయింపులకు స్పష్టమైన విధానం తేవాలని, తిరుమల మోడల్‌లో గెస్ట్‌హౌస్‌లు, భూ హక్కుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. భూసేకరణకు నిధులు మంజూరు చేయాలని, ఇంజనీర్ల కమిటీ నివేదికను వారంలో అధ్యయనం చేసి తుది నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సూచించారు. యాదగిరిగుట్టపై గెస్ట్‌హౌస్‌ ల నిర్మాణానికి ముందుకొచ్చే వారి జాబితా రూపొందించాలని సూచించారు. విడతల వారీగా గెస్ట్‌హౌస్‌లు, భూ హక్కుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.

30-06-2026