ఊటుపల్లి గ్రామంలో సగం జాతీయ జెండా ఎగురవేతపై వివాదం
బోధన్, ఆగస్టు 15 (విజయక్రాంతి): బోధన్ మండలం ఊటుపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జాతీయ జెండాను సగం స్థాయిలో ఎగురవేయడాన్ని “అర్ధనిమజ్జనం” అంటారు. సాధారణంగా దేశంలో విషాద సందర్భాలు, ప్రముఖుల మరణం వంటి ప్రత్యేక సందర్భాల్లో గౌరవ సూచకంగా జాతీయ జెండాను అర్ధనిమజ్జనంలో ఉంచుతారు. జాతీయ జెండాను అర్ధనిమజ్జనంలో ఎగురవేశారు. సగం మేరకు ఎగురవేయడంపై వివాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ బోయి ప్రశాంతి జాతీయ జెండాను సగం మేరకు ఎగురవేశారని గ్రామ ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు ఆరోపించారు. జాతీయ జెండాను సగం మేరకు ఎగురవేయడం జాతీయ పతాకానికి అవమానకరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.






