బోధన్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 09:54 AM
బోధన్ ఆగస్టు 15 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి వందేమాతరం గేయాన్ని అలపించి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.






