పూడూర్లో యాదవ సంఘాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ అర్బన్, మే 17 (విజయక్రాంతి): పూడూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు నీతి,నిజాయితీగా ఉంటారని,నమ్మిన వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తారని తెలిపారు. తాను గతంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందించగా సద్వినియోగం చేసుకుని సంఘం భవనాన్ని నిర్మించుకోవడం సంతోషకరం అన్నారు.
18-05-2026